'వృక్షరాణి' తులసి తిమ్మక్క గురించి తెలుసా?
మనకెంతో ఇచ్చిన ప్రకృతిని కాపాడేందుకు ఒక్క
మొక్కనైనా నాటలేకపోతున్నాం. కానీ కర్ణాటకకు
చెందిన 113ఏళ్ల తులసి తిమ్మక్క తన జీవితాన్నే
మొక్కలు నాటేందుకు త్యాగం చేశారంటూ నెటిజన్లు
పోస్టులు పెడుతున్నారు. గత 80 ఏళ్లలో ఈ 'వృక్షరాణి' 8,000 కంటే ఎక్కువ మొక్కలు నాటి బీడు భూములను పచ్చగా మార్చారు. పిల్లలు లేని లోటును తీర్చుకునేందుకు ఆమె చెట్లను దత్తత తీసుకున్నారు. ఆమెను కేంద్రం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
Comments
Post a Comment